ETV Bharat / bharat

'పెట్రో ధరల పేరిట కేంద్రం​ బలవంతపు వసూళ్లు'

కేంద్రం.. పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేస్తోందని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. "స్పీక్​ అప్​ అగైనస్ట్​ ఫ్యూయల్​ హైక్"లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకుని సంక్షోభం సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 29, 2020, 3:54 PM IST

Govt 'extorting' people with fuel price hikes: Sonia Gandhi
'పెట్రోల్​ ధరలు పెంచి ప్రజల నుంచి బలవంతపు వసూళ్లు'

లాక్​డౌన్​ అమలు చేసినప్పటి నుంచి 22 సార్లు ఇంధన ధరలను పెంచారంటూ భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ధరలు పెంచుతూ ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్​ చేశారు.

ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ చేపట్టిన "స్పీక్​ అప్​ అగైనస్ట్​ ఫ్యూయల్​ హైక్​" కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఓవైపు కరోనా వైరస్​ పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ధరల బాదుడుతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరోనా సంక్షోభంలో పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను తక్షణమే తగ్గించాలని.. కాంగ్రెస్​ సభ్యులతో సహా నేను ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నా. మార్చి నుంచి పెట్రోల్​, డీజిల్​ మీద పెంచిన ఎక్సైజ్​ సుంకాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నా. దానితో దేశ ప్రజలు లబ్ధిపొందుతారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు ఇది ఉపశమనం ఇస్తుంది."

--- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వం ఖజానాను నింపుకుంటోందని విమర్శించారు సోనియా.

"అన్యాయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి ప్రజల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తోంది కేంద్రం. మార్చి 25 లాక్​డౌన్​ అనంతరం మోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 22సార్లు ధరలను పెంచింది. ఓవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో మాత్రం ధరలు పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఎక్సై​జ్​ సుంకాలతో ప్రజల నుంచి లక్షల కోట్లను వసూలు చేస్తోంది."

--- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

కాంగ్రెస్​ చెపట్టిన "స్పీక్​ అప్​ అగైనస్ట్​​ ఫ్యూయల్​ హైక్​"లో భాగంగా కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రాహుల్​ గాంధీ, రణదీప్​ సుర్జేవాలా, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇదీ చూడండి- కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్​': కేజ్రీవాల్

లాక్​డౌన్​ అమలు చేసినప్పటి నుంచి 22 సార్లు ఇంధన ధరలను పెంచారంటూ భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ధరలు పెంచుతూ ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్​ చేశారు.

ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ చేపట్టిన "స్పీక్​ అప్​ అగైనస్ట్​ ఫ్యూయల్​ హైక్​" కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఓవైపు కరోనా వైరస్​ పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ధరల బాదుడుతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరోనా సంక్షోభంలో పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను తక్షణమే తగ్గించాలని.. కాంగ్రెస్​ సభ్యులతో సహా నేను ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నా. మార్చి నుంచి పెట్రోల్​, డీజిల్​ మీద పెంచిన ఎక్సైజ్​ సుంకాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నా. దానితో దేశ ప్రజలు లబ్ధిపొందుతారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు ఇది ఉపశమనం ఇస్తుంది."

--- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వం ఖజానాను నింపుకుంటోందని విమర్శించారు సోనియా.

"అన్యాయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి ప్రజల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తోంది కేంద్రం. మార్చి 25 లాక్​డౌన్​ అనంతరం మోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 22సార్లు ధరలను పెంచింది. ఓవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో మాత్రం ధరలు పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఎక్సై​జ్​ సుంకాలతో ప్రజల నుంచి లక్షల కోట్లను వసూలు చేస్తోంది."

--- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

కాంగ్రెస్​ చెపట్టిన "స్పీక్​ అప్​ అగైనస్ట్​​ ఫ్యూయల్​ హైక్​"లో భాగంగా కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రాహుల్​ గాంధీ, రణదీప్​ సుర్జేవాలా, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇదీ చూడండి- కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్​': కేజ్రీవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.